ప్రజాశక్తి-రాయదుర్గం : డి.హీరేహాళ్ మండలం జాజారకల్లు టోల్ గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో గొర్రెల కాపరి రుద్రుడు (30) మరియు 18 గొర్రెలు మృతి చెందారు. ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డి.హీరేహాళ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.