ప్రజాశక్తి-బాపట్ల : జమ్మూ కాశ్మీర్ లోని లద్ధాక్ వద్ద యుద్ధ ట్యాంకులో వెళుతూ నదిని దాటే ప్రయత్నంలో మరణించిన ఐదుగురు సైనికుల్లో రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాన్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలిసింది. 17 సంవత్సరాల క్రితం భారత సైన్యం లో చేరిన సుభాన్ ఖాన్ ప్రస్తుతం హవల్దార్ స్థాయిలో మెకానికల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 7వ తేదీన స్వగ్రామం రావలసి ఉండగా గత శనివారం యుద్ధట్యాంక్ తో సహా నదిలో కొట్టుకుపోయిన ఘటనలో సుభాన్ ఖాన్ మరణించారు. ఈ ఘటనలోనే ప్రకాశం జిల్లా రాచర్ల కు చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి కూడా మరణించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/A-jawan-from-Raypalle-died-in-Ladakh.jpg)