ధీక్ష విరమించాలని వేడుకోలు
త్వరలో పరిష్కారం లభిస్తుందని వరికూటి అశోక్ బాబు హామీ
ప్రజాశక్తి-బాపట్ల జిల్లా : వేమూరు నియోజకవర్గం, చుండూరులో తమ సమస్యలకోసం గత రొండు వారాలుగా నిరవదిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ & వర్కర్స్ యూనియన్ వారి శిబిరాన్ని సందర్శించి వారి సమస్యలపై వారితో వైయస్సార్సీపి వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు చర్చించారు. సమస్యలను ప్రభుత్వ పెద్దల ద్రుష్టికి తీసుకెళ్ళి వీలైనంత తొందర్లో అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం దొరికేలా తన వంతుగా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని, అంతవరకూ దీక్షకు విరామం ప్రకటించి విధులలో చేరాలని వారికి హితవు పలికారు.