ప్రజాశక్తి-రేపల్లె : రేపల్లె పట్టణానికి చెందిన ఆలపాటి ప్రసాద్ బాపట్ల సమీపంలో నందిరాజతోట వద్ద వున్న నాగరాజు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాలువలో నుంచి స్థానికులు, పోలీసులు బయటకు తీశారు. కొన ఊపిరిలో ఉన్నాడని గుర్తించిన బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి, ఎస్సై లు 108 ద్వారా బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులతో ప్రసాద్ ఆత్మహత్య యత్నం చేసినట్టు భావిస్తున్నారు.