పేదలకు అండగా ఉంటా : బాలాజీ

Apr 20,2024 00:03 ##YCP #Balaji

ప్రజాశక్తి -పర్చూరు
పేదలకు అండగా ఉంటానని వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి యడం బాలాజీ అన్నారు మండలంలోని పెద్దివారిపాలెం, ఉప్పుటూరు, నాగులపాలెం గ్రామాల్లో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ వైసిపి ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. పేదలకు ఇల్లు, పెన్షన్లు, విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన ద్వారా చేసిన మేలును వివరించారు . ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలన్నీ ఇంటింటికి తీసుకువచ్చిన ఘనత సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిదేనని అన్నారు. ప్రజలకు ఇంత మేలు చేసిన ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కటారి అప్పారావు, కోట హరిబాబు, దాసరి వెంకట్రావు, సర్పంచ్ అప్పయ్య చౌదరి, తిరుమలేశ్వరరావు, నల్లగొర్ల వెంకట్రావు, సొసైటీ చైర్మన్ కుక్క పల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️