ప్రజాశక్తి – బాపట్ల
ఎంఎల్ఎ కోన రఘుపతి 2019ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమయ్యారని జనసేన ఇన్ఛార్జి నామన వెంకట శివ నారాయణ ఆరోపించారు. స్థానిక జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు నెరవేర్చకుండా తిరిగి ఎన్నికల్లో ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. తన హయాంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని అనడం హాస్యస్పదంగా ఉందని అన్నారు. పట్టణంలో దోమల సమస్య నివారణకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను నిర్మించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని గత ఎన్నికల్లో రఘుపతి చేసిన వాగ్దానాల్లో ఒకటని అన్నారు. ఎన్ని పూర్తి చేశారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు. సమావేశంలో బాపట్ల, పీవీ పాలెం మండలాల జనసేన నాయకులు దాసరి ఏసుబాబు, హుస్సేన్ బేగ్ , ఆరమల్ల సుజిత్, షేక్ కరిముల్లా, షేక్ ఆసిఫ్, షేక్ మున్నా, అన్సారి, నామన శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.