తీర గ్రామాల్లో కోన ఎన్నికల ప్రచారం

Mar 29,2024 00:18 ##konaraghupati #mla #bapatla

ప్రజాశక్తి – బాపట్ల
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేసిన సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తిరిగి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. మండలంలో తీర ప్రాంత గ్రామాలైన అడవిపల్లిపాలెం, పాండురంగాపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు, త్రాగునీటి సమస్య పరిష్కారానికి మరింత పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. మూడోసారి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన తనను గెలిపించాలని కోరారు.

➡️