పింఛన్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య

Jul 1,2024 11:59 #Bapatla District

ప్రజాశక్తి – చీరాల : తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఎన్నికల్లో పింఛన్ల నగదు పెంపు పై ఇచ్చిన హామీని అమలు చేస్తూ లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో భాగంగా చీరాలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. పట్టణంలోని పలు వార్డులలో, పంచాయతీలో లబ్ధిదారులకు ఆయన స్వయంగా పింఛన్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ పింఛను మొత్తాన్ని పెంచడంపై లబ్ధిదారుల్లో ఆనందం కనిపిస్తుంది అన్నారు.రాష్ట్రములో ప్రతి ఇంటికి పెద్ద బిడ్డలా అండగా నిలిచిన సీఎం నారా చంద్రబాబు నాయుడికి లబ్ధిదారులందరూ ధన్యవాదములు తెలియజేస్తున్నారని అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది అందరూ పింఛన్లు పంపిణీ పనిలో ఉన్నారని లబ్ధిదారులు అందరికీ పింఛన్లు సక్రమంగా అందేలా పూర్తి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.ఆయన వెంట టిడిపి సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు,గంగరాజు పలువురు ఉన్నారు.

➡️