ప్రజాశక్తి-మార్టూరు : 2024 నూతన క్యాలెండర్ ని ఇసుకదర్శి లోని ఎమ్మెల్లే క్యాంపు కార్యాలయంలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ఆదివారం ఆవిష్కరించారు. ప్రతి అక్షరం ప్రజల పక్షం అనే నినాదాన్ని నిలబెట్టుకుంటూ వాస్తవాలను నిర్భయంగా అక్షర రూపంలో ప్రజలకు అందిస్తూన్నఏకైక దినపత్రిక ప్రజాశక్తి అని ప్రశంసించారు.భవిషత్తులో ఇదే ఒరవడిని ప్రజాశక్తి కొనసాగించాలని ఏలూరి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్టూరు విలేఖరి కుడారి రాజకుమార్, స్థానిక టిడిపి నాయకులు,ఉపాధ్యాయ సంఘ నేతలు పాల్గొన్నారు.