వేడెక్కిన చీరాల రాజకీయం

Mar 16,2024 15:31 #Bapatla District

టిడిపిలో చేరేందుకు అమంచి సన్నాహాలు

ప్రజాశక్తి – చీరాల : చీరాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కరణం వెంకటేష్ పేరును సిఎం జగన్మోహన్ రెడ్డి అధికారంగా ప్రకటించటంతో ఆమంచి టిడిపిలోకి వెళుతున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 17న టిడిపి, జనసేన, బీజేపీ కూటమి సభకు అమంచి కృష్ణమోహన్ హాజరు కానున్నట్లు సమాచారం. టిడిపిలో చేరెందుకు ముఖ్య కార్యకర్తలతో ఈ పాటికే పూర్తి అయినా బేటీ.అయితే చంద్రబాబు, లోకేష్ లతో తన గురించి చర్చించమని ముఖ్య నేతలతో అమంచి సంప్రదింపులు.తన ఇంటి నుండి హుటా హుటిగా వాహనాలలో బయలుదేరిన వైనం. ప్రస్తుతం ఈ చర్చ చీరాల నియోజకవర్గంలో హట్ టాపిక్ గా మారింది.

➡️