అభినందన

Feb 2,2024 16:05 #Bapatla District
wishes to students

ప్రజాశక్తి-యద్దనపూడి : మండలంలోని సూరవరపుపల్లి గ్రామ ప్రాధమిక పాఠశాల (యస్.సి )నందు శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు శారద విద్యార్థుల అభినంద కార్యక్రమం నిర్వహించారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల గుంటూరులో జరిగిన కార్యక్రమంలో చేతి వ్రాత పోటీలలో బహుమతులు సాధించారు. గ్రామ సర్పంచ్ వెంకటప్పయ్య యం.ఇ.ఒ గోపిలు ప్రధానోపాధ్యాయురాలు, విద్యార్థులును అభినందించారు. యం.ఇ.ఒ గోపి మాట్లాడుతూ విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సాటి ఎవరు రారు అన్నారు. బహుతులు సాధించిన విద్యార్థులు బొల్లాపల్లి చరణ్ తేజ్,వంజా కీర్తి,జెస్సిలు ఉన్నారు. కార్యక్రమంలో అనంతవరం ఉన్నత పాఠశాల ప్రాధానోపాధ్యాడు రాఘవ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్ మోహన్, రవి,తదితరులు పాల్గొన్నారు.

➡️