ప్రజాశక్తి- చిత్తూరు డెస్క్: నగరి ఆర్డీవోగా వెంకటరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరలో ఆర్డీవోగా ఉన్న సుజన తుడాకు బదిలీపై వెళ్లడంతో కర్నూలు నుంచి బదిలీపై వచ్చిన వెంకటరెడ్డి నగరి ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి నిబద్దతతో ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. కార్యాలయానికి సంబంధిత వ్యవహారాలలో ఎలాంటి ఆలసత్వం లేకుండా సత్వరం పూర్తి చేస్తామన్నారు.
![నగరి ఆర్డీవోగా వెంకటరెడ్డి](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1-copy-66.jpg)