ప్రజాశక్తి-సోమల: రంజాన్ సందర్భంగా మండల కేంద్రం లోని మసీదులో ముస్లింలు సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విందులో యువనాయకులు పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు మసీదు పెద్దలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో అమాస మోహన్, ప్రభాకర్, బాషా మసూద్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.