పాతబస్టాండ్ వద్ద స్థల పరిశీలనలో పోలీసులు, అధికారులు
ప్రజాశక్తి – మంగళగిరి : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మంగళగిరికి రానున్నారు. ఉదయం 10:30 గంటలకు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో ఆయన మాట్లాడతారని నాయకులు తెలిపారు. వైసిపి తరపున గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్య, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ ప్రదేశాన్ని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు గురువారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థలం కోసం నిడమర్రు రోడ్డులోని ఖాళీ స్థలాన్ని, రైలుగేటు వద్ద గల డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలాఇంచారు. పరిశీలనలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ రవికాంత్, పట్టణ సిఐ ఎం.శ్రీనివాసరావు, రూరల్ సిఐ వెంకటరావు పాల్గొన్నారు.