సిబ్బందితో మాట్లాడుతున్న డిసి హేమంత్ నాగరాజు
తెనాలి : స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయాన్ని శనివారం ఎస్ఇబి స్పెషల్ నోడల్ డిప్యూటీ కమిషనర్ కె హేమంత్ నాగరాజు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనధికార మద్యం నిల్వలు, తరలింపు వంటి ఘటనలపై నమోదైన కేసులను, సంబంధిత అధికారలను పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో అనధికార మద్యం నిల్వలను ఉపేక్షించవద్దని, మద్యం పంపిణీ వంటివి అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ పద్మజ, సిబ్బంది పాల్గొన్నారు.