ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండల ఎంపీడీవోగా ఎన్ బుజ్జి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం ఎంపీడీవో బాధ్యత నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా చాగల్లు ఎంపీడీవో గా వచ్చినట్లు ఆమె తెలిపారు. ఇప్పటివరకు ఇన్చార్జ్ ఎంపీడీవో పనిచేస్తున్న పి నిర్మలాకుమారి తమ విధుల్లోకి సూపర్డెంట్ గా కోనసాగుతున్నారు. ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండల కార్యాల సిబ్బంది. మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాల సిబ్బంది ఆమెకు పుష్ప గుచ్చి శుభాకాంక్షలు తెలిపారు.