ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమం సోమవారం ఉదయం 5 గంటల నుండి ఇంటింటికి సచివాలయం సిబ్బంది తో పాటి టిడీపీ నాయకులతో కలసి పంపిణీ చేస్తున్న ట్లు ఎంపిడిఓ నాతి బుజ్జి తెలిపారు.చాగల్లు లో టిడీపి సీనియర్ నాయకులు ఆళ్లహరిబాబు ప్రారంభించారు . కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు చాగల్లు గ్రామంలో నెలటూరు గ్రామంలో పెన్షన్ లబ్దలకు పంపిణీ చేశారు.నేలటూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు సిబ్బందితో కలసి పెంఛను రూ 7 వేలు అందజేసి ప్రారంబించారు .అలాగే తెలుగు యువత నాయకులు నాదెళ్ల నానీ కరుటూరి సతీష్ దొంగ రామకృష్ణ ఆళ్ళ సత్యనారాయణ పెంఛన్లను అందజేసారు. సర్వర్్ ఇబ్బందితో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు 5 గంటలకి వరకు పెన్షన్ దారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా పెన్షన్ అందుకున్నా లబ్ధిదారులు ముఖ్య మంత్రి చంద్రబాబు కి ఎన్డీఏ కూటమి నాయకులకు అభినందనలను తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Pension-troubles-with-barking-server.jpg)