ప్రజాశక్తి – ఏలూరు టౌన్
ఎస్టియు రాష్ట్ర శాఖ ముద్రించిన డైరీ, క్యాలెండర్ను పెదవేగి మండల విద్యాశాఖాధికారి బుద్ధవ్యాస్ బుధవారం పెదవేగిలో ఆవిష్కరించారు. బుధవ్యాస్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు సమిష్టిగా పనిచేసి మండలంలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాగార్జున, ఎమ్డీ షపి, భూషణం, సూర్యనారాయణ, ప్రవీణ్, గుప్తా, రమేష్ పాల్గొన్నారు.