ప్రజాశక్తి-ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన స్థలానికి చేరుకొన్న ఎస్సై వి.చంద్రశేఖర్ వివరాలు సేకరించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/road-accident-in-eluru-dist.jpg)