ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్
జంగారెడ్డిగూడెం పట్ట ణానికి చెందిన మాజీ సర్పంచి, కీర్తిశేషులు తల్లాడి సత్తిపండు కుమార్తె, విశాఖపట్టణం వాస్తవ్యులు గ్రీన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులైన గీతా నారాయణన్ స్థానిక శాఖా గ్రంథాలయానికి గ్రూప్-1, గ్రూప్-2, డిఎస్సి పోటీ పరీక్షల నిమిత్తం అవసరమయ్యే సుమారు రూ.27 వేల విలువైన 44 పుస్తకాలను స్థానిక గ్రంథాలయ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా మరిన్ని పుస్తకాలను భవిష్యత్లో అందిస్తామని తెలిపారు. ఐఎఎస్, ఐపిఎస్, తదితర 99 రకాల పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచిత శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించే ఆలోచన ఉందని, త్వరలోనే దానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గీతా నారాయణన్ ఇటీవల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో రూ.3 లక్షలతో తాగునీరు సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి దుర్గారావు, ప్రముఖ కాలమిస్ట్ శ్రీనివాసరాజు, పలువురు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారు, గ్రంథాలయ పాఠకులు, గ్రామ పెద్దలు హాజరై దాత గీతా నారాయణ్ ఔదార్యాన్ని కొనియాడారు. ఆమె దాన గుణాన్ని అభినందించారు.