అగ్ని ప్రమాద బాధితులకు జడ్పీటీసీ సభ్యుల ఆర్థిక సాయం

Mar 1,2024 13:00 #Eluru district

ప్రజాశక్తి-టి.నరసాపురం‌ : మండలంలోని మర్రిగూడెంలో అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన బాదిత కుటుంబానికి జడ్పీటీసీ సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణరాజు ( సూరిబాబు) చేతుల మీదుగా రూ. 5వేలు ఆర్ధిక సహాయం తో పాటు ఇంటి సామగ్రి అందజేశారు. మర్రిగూడెం గ్రామానికి చెందిన కురసం చంద్రావతి భర్త వెంకటేశ్వరరావుకి చెందిన తాటాకు ఇల్లు దగ్దమై పూర్తిగా నిరాశ్రయులై రూ.4లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇంటి పత్రాలు, పొలం పట్టాలు దగ్దం కావడంతో విషయం తెలుసుకున్న జడ్పిటిసి సూరిబాబు ఇతర వైసిపి నాయకులు బాదితులను పరామర్శించారు. వెంటనే రూ. 5 వేలు ఆర్ధిక సహాయం తో పాటు బియ్యం, నూనె, పప్పులు, వంట పాత్రలు, దుస్తులు అందజేశారు. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సౌకర్యాలు అందిస్తామని కాలిపోయిన పత్రాలన్ని సచివాలయం ద్వారా మంజూరు కు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం ద్వారా ఇల్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపీ దారబోయిన లక్ష్మి, వెంకటేశ్వరరావు, సర్పంచి సోయం బిందు, వైసిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కురసం నిరిక్షనరావు, వార్డు మెంబర్ లు అధికారులు పాల్గొన్నారు.

➡️