ప్రజాశక్తి – కామవరపుకోట
ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని టిడిపి చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్ఎ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. మండలంలోని శివారు తహశీల్దార్ కార్యాలయం సమీపంలో కొద్ది రోజుల క్రితం రెండు మోటార్ సైకిళ్లు ఢకొీన్న సంఘటనలో ఎస్.ఏసు, పండూరి రత్తయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. ఇరువురు కూడా ఆర్థిక స్తోమత లేనివారు. ఈ సంఘటనను మండల టిడిపి అధ్యక్షుడు కిలారి సత్య నారాయణ, స్థానిక వార్త విలేకరి కడిపి పాపారావు టిడిపి నియోజకవర్గ ఎంఎల్ఎ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయం చేసి తన సేవాగుణం చాటుకున్నారు. సదరు సొమ్మును గురువారం సాయంత్రం బాధితులకు అందజేశారు.