ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి :కలెక్టర్

Apr 27,2024 16:19 #Kurnool, #vote

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్ర ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ జి సృజన మరియు 137-కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కర్నూలు నగర పాలక కమిషనర్ శ్రీ భార్గవ్ తేజ అదేశముల మేరకు, శనివారం స్థానిక జొహరాపురం చుట్టుపక్కల ప్రాంతంలో స్వీప్ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలను ఓటు హక్కు వినియోగం పట్ల జాగృతపరుస్తూ ఈ ర్యాలీ, 248 నుండి 258 వరకు నంబర్లు గల పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ మే 13 న జరుగబోయే ఎన్నికలో పార్లమెంటుకు మరియు అసెంబ్లీకు తమ యొక్క ఓటును తప్పకుండా వినియోగించుకోవాలని, అవగాహన కల్పించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఓటు ఆవశ్యకతను తెలియజేస్తూ, జొహరాపురం అంబెడ్కర్ స్కూల్ గ్రౌండ్ నందు విన్నూతంగా ముగ్గుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పెంచలయ్య గారు, సి ఓసంబంధిత బిఎల్ఓ లు, ఆర్ పిలు, పొదుపు మహిళా గ్రూపు సభ్యులు, స్వీప్ కార్యకర్తలు, కళాజాత సిబ్బంది పాల్గొన్నారు.

➡️