పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం

Dec 9,2023 14:30 #East Godavari
free medical camp for animals

ప్రజాశక్తి-చాగల్లు: చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో శనివారం ఉదయం 9 గంటల నుండి మిచాంగ్ తుఫాను సహాయార్థం పాడి పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం మరియు గొంతువాపు టీకాలు కార్యక్రమం నిర్వహించడమైనది. పశు వైద్యశాఖ డాక్టర్ యు ముకేశ్ తెలిపారు. ఈ పశు వైద్య శిబిరంను గ్రామ ఉపసర్పంచ్ 
కోడూరి.కాశీ గంగాధరరావు ప్రారంభించగా, గొంతు వాపు టీకాలు కార్యక్రమం ఎంపిటిసి లకం సాని నాగసూర్య ప్రభావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు డివిజన్ ఉప సంచాలకులు డా.జి.రాధాకృష్ణ, ఏడి డా ఏ వెంకటరెడ్డి పాడిరైతులకు పశుసంవర్ధక శాఖ వివిధ పథకాలను వివరించారు. పశువైద్య శిబిరంలో పాల్గొన్న 32 మంది పాడి రైతులకు ఉచితంగా ఖనిజ లవణ మిశ్రమాలను, లివర్ టానిక్ లు ఇవ్వడం జరిగినది. సుమారుగా 9 ఆవులు, 34 గేదెలు కు చికిత్సలు, 14 గర్భకోశ వ్యాధి చికిత్స, నట్టల నివారణ మందులు-48, గొంతు వాపు వ్యాధి టీకాలు-94 ఇవ్వడం జరిగిందని పశు వైద్యాధికారులు డా.యు.ముఖేష్, డా.బి. గిరీషా డా.ఎస్.సుజిత, తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది కే రాజశేఖర్ గౌతమ్ కుమార్, విజయలక్ష్మి, శ్రీమన్నారాయణ, నాగేశ్వరరావు, అంబేద్కర్ పాల్గొన్నారు.

➡️