గంజాయికి అడ్డాగా విశాఖ : గణబాబు

May 6,2024 23:59 #గణబాబు
గణబాబు

ప్రజాశక్తి -గోపాలపట్నం : విశాఖ ప్రాంతాన్ని గంజాయికి అడ్డాగా వైసిపి ప్రభుత్వం మార్చిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు ఆరోపించారు. జివిఎంసి 91వ వార్డు పరిధి రామకృష్ణనగర్‌, నేతాజీవీధి, స్టేషన్‌రోడ్డు, గోపాలపట్నం, బిఆర్‌టిఎస్‌ రోడ్డు ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులతో కలిసి గణబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రశాంతమైన మహా విశాఖ నగరాన్ని వైసిపి పాలనలో భూదందాలకు అడ్డాగా మార్చారని, హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం టిడిపి ప్రభుత్వంలోనే జరిగాయన్నారు. ప్రజలపై చెత్త పన్ను వేసిన ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎంపీగా ఎం.శ్రీభరత్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️