- 942మందికి వైద్య పరీక్షలు
- నెలరోజులకు సరిపడు మందులు పంపిణీ
ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : మండలంలోని వాడరేవు శ్రీశ్రీశ్రీ రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆశ్రమం ఆవరణలో ఆదివారం ఉచిత షుగరు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 942 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి నెల రోజులకు సరిపడు మందులు ఉచితంగా అందజేశారు. శిబిరానికి హాజరైన వారందారికి అల్పారం, తాగున్నీరు, ఇతర సహాయక ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ మేనేజర్ నారాయణం సురేష్ తెలిపారు. మందులు వాడటంతోపాటు ఆహార అలవాట్లు, జీవన విధానం మార్చుకోవాలని వైద్యులు సూచించారు. మానసిక ఆందోళన తగ్గించుకోవాలని సూచించారు. జీవన విధానం మార్చుకోవడం ద్వారా షుగరు నియంత్రణలో ఉంచుకోవచ్చని చెప్పారు. క్యాంపులో డాక్టర్ ఎం రాజరాజేశ్వరి, డాక్టర్ కమలా రాజేశ్వరి, డాక్టర్ లలిత్ ప్రకాష్, డాక్టర్ పేట శ్రీకాంత్, డాక్టర్ సుధాకర్ యాదవ్, డాక్టర్ సూర్యప్రకాష్ వైద్య పరీక్షలు చేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు కె కష్ణారావు, కామేశ్వరరావు, ఎంజి శంకరరావు, కుమార్, ఎ సురేష్, మిత్ర ల్యాబ్ వలి, దుర్గగుడి శీను, గోపాల్, సాయి ఫణికిషోర్, వాడరేవు స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, చీరాల మహిళా కళాశాల విద్యార్థులు రోగులకు ఆహారం, తాగునీటి వసతులు, సహాయక ఏర్పాట్లు చేశారు.కార్యక్రమంలో క్యాంపు నిర్వహకులు వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు.