ప్రజాశక్తి – గొల్లప్రోలు (పిఠాపురం)
మండలంలోని తాటిపర్తి 1, 2 సచివలయాల పరిధిలో 37 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి బి రాజేంద్రకుమార్ను వివరణ కోరగా రెండు సచివాలయాల పరిధి లో 53 మంది వాలంటీర్లు ఉన్నారని, శనివారం 37 మంది స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలను అందజేశారని తెలిపారు.