ప్రజాశక్తి-కాకినాడ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జీవితం కృషిని వివరిస్తూ హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ రూపొందించిన సంఘం శరణం గచ్ఛామి నృత్య రూపకాన్ని ఏప్రిల్ 8న సూర్యకళా మందిరంలో ప్రదర్శిస్తున్నట్టు పలు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. శుక్రవారం ఇంద్రపాలెం వంతెన అంబేడ్కర్ విగ్రహం వద్ద నాటక ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్ను అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే పేరెన్నికగన్న నాయకుడని తెలిపారు. ఆయన బాల్యంలో, యవ్వనంలో పడిన కష్టాలు, దేశం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి, తపన ఈ నాటకం లో చూడవచ్చన్నారు. సిఐటియు, యుటిఎఫ్, జెవివి, కెవిపిఎస్, ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐ వంటి ప్రజా సంఘాలు సంయుక్తంగా ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రవి చక్రవర్తి, జెవివి జిల్లా అధ్యక్షుడు కెఎంఎంఆర్ ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు జిఎస్.వర్మ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.సత్తిరాజు, కోశాధికారి మలకా వెంకట రమణ, నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి.రాజా, ఐద్వా కార్యదర్శి కె.నాగజ్యోతి, కెవిపిఎస్ నాయకులు కటారి పద్మనాభం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంజి.సూరిబాబు, నగర అధ్యక్షుడు ఎ.సంజరు, శ్రామిక మహిళా నేతలు చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, ఇ.చంద్రావతి, సిహెచ్.వేణు, డివైఎఫ్ఐ నాయకులు పి.దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.
![8న సంఘం శరణం గచ్ఛామి నాటక ప్రదర్శన](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Untitled-1-copy-191.jpg)