ప్రజాశక్తి – ఏలేశ్వరం
ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడి శంకవరం మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79 గ్రామాల్లో 227 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు ప్రక్రియ కొనసాగగా 6 గంటల తర్వాత కూడా లైన్లలో ఉన్న వాటర్లను ఓటు వినియోగించు కునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో పలు పోలింగ్ స్టేషన్లో ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు నియోజకవర్గ వ్యాప్తంగా 67. 68 శాతం ఓట్లు నమో దు అయినట్లు ఎన్నికల అధికారి ఎ.శ్రీని వాసరావు తెలిపారు. కొన్ని పోలింగ్ స్టేషన్లో వెలుగు సక్రమంగా లేకపోవడం, ఇవిఎంలలో స్వల్ప మరమ్మతులు రావ డం తప్ప ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందన్నారు. పలు పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు ఉదయం 6 గంటలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు క్యూ కట్టారు. ఇవిఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది.