మండపేటలో డాక్టర్ పద్మను సత్కరిస్తున్న పియంపిలు
ప్రజాశక్తి-మండపేట
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని పియంపి అసోసియేషన్ ఆద్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పద్మ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పి ఎం పి అసోసియేషన్ 60 సంవత్సరాల సావినార్ను బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించినప్పుడే సమాజ అభివృద్ధి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిఎంపి గౌరవ అధ్యక్షులు బల్లా వెంకటరమణ, మండల పిఎంపి ప్రధానకార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వానపల్లి కనకరాజు, టి విజయశేఖర్, కె.వీరబాబు, జివి.చినబాబు, పి.సతీష్, నాగేశ్వరరావు, సురేష్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.