కోటిపల్లిలో పర్యటిస్తున్న ఎంపీ బోస్
ప్రజాశక్తి-రామచంద్రపురం
వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి వైసిపిని గెలిపించుకోవాలని సీనియర్ నాయకులు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదివారం కె.గంగవరం మండలంలోని కోటిపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కుమ్మరసావరం, శెట్టి బలిజపేట, దళిత పేటలో పర్యటించి పలువురు వైసిపి నాయకులమద్దతు కూడగట్టారు. అదేవిధంగా త్వరలో జరిగే నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమానికి కార్యకర్తలంతా తరలిరావాలని కోరారు. ఆయన కలిసిన వారిలో కోటిపల్లి అబ్బు, మానే చిన్నా, పెమ్మాడి మల్లేశ్వరరావు, పంపన సుబ్బారావు, కుందూరు సర్పంచ్ పంపన సత్యానందం, కూళ్ల సర్పంచ్ చిల్లే నాగేశ్వరరావు, కె.గంగవరం మండలం వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరు లు పాల్గొన్నారు.