సేవా పురస్కార గ్రహీత కాశీకి సన్మానం

Feb 4,2024 18:15

అర్చకులు కాశీ శేఖరుబాబును సన్మానిస్తున్న నర్సిపూడి నేతలు

ప్రజాశక్తి-ఆలమూరు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉత్తమ అర్చక బ్రహ్మ, ఉత్తమ సేవా పురస్కార అవార్డులు అందుకున్న నర్సిపూడి శివాలయం అర్చకులు కాళ్ళకూరి కాశీ శేఖర్‌ బాబును గ్రామ ప్రముఖులు సన్మానించి అభినందించారు. వారు మాట్లాడుతూ ఉత్తమ సేవ పురస్కారం లభించడం ఆయన శ్రమకు తగ్గ ఫలితం అన్నారు. కార్యక్రమంలో దేవస్థానాల ఇఒ ఎంఎస్‌ఆర్‌ కృష్ణ, మాజీ ఎఎంసి ఛైర్మన్‌ దున్నే స్వామినాయుడు, నేతలు వడ్డీ దొరయ్య నాయుడు, పంతాల భగవాన్‌, శ్రీవిద్య స్కూల్‌ అధినేత గాంధీ, తదితరులు పాల్గొన్నారు.

 

➡️