పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన జీవితం

Mar 23,2024 15:19 #Konaseema

ముగిసిన పౌష్టికార పక్షోత్సవం వారోత్సవాలు
ప్రజాశక్తి-మండపేట : గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఐసిడిఎస్ కపిలేశ్వరపురం ప్రాజెక్ట్ సిడిపిఓ గజలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక ప్రకాశం మున్సిపల్ పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు అంగన్వాడి కేంద్రాలలో పౌష్టికార పక్షోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మంచి ఆరోగ్యం పోషకాహారంలోనే ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకపోషక విలువలున్న పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు వి.సింహాచలం, సునీత, శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు దేవకీదేవి, సత్యకుమారి, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

➡️