పందిరి రాట వేస్తున్న అర్చకులు
ప్రజాశక్తి-ఆత్రేయపురం
కోనసీమ తిరుమల శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ18 నుంచి 24 వరకు వారం రోజులు పాటు నిర్వహించనున్నారు. స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సావాలు సందర్భంగా గురువారం డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి భూపతి రాజు కిషోర్ కుమార్, అర్చకులు పందిరి రాటకు పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. వారం రోజులు పాటు జరిగే ఈ కళ్యాణ మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా అధిక సంఖ్యలో యాత్రికులు రానున్న దృష్టా వారి విశ్రాంతి తీసుకునిలా సౌకర్యాలు వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయనున్నారు.