ప్రజాశక్తి – ఆలమూరు(కోనసీమ) : కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు గెలుపులో కీలక పాత్ర పోషించిన టిడిపి నాయకులు సలాది నాగేశ్వరరావును యుటిఎఫ్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో ఉపాధ్యాయుల సమస్యలను ఎమ్మెల్యే బండారు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని సలాది హమీఇచ్చారు. ఈ కార్యక్రమంలోయుటిఎఫ్ మండల అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, రాష్ట్ర నాయకులు వైవివి రమణ, సత్యవేణి, రమేష్, శ్రీనివాస్, చంద్రమోహన్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/konaseema.jpg)