ప్రజాశక్తి-అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగ అయిన సంక్రాంతి నాడు కూడా అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించారు. 35 వ రోజు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్మికులు సమ్మె నిర్వహించడంతోపాటు అక్కడే పొంగళ్ళు తయారు చేసి పండుగ నిర్వహించుకున్నారు. వీరికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం పోలినాయుడు, జనసేన పార్టీ నాయకులు గుడివాక శేషుబాబు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బండి ఆదిశేషు సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు నిర్మల జ్యోతి, ఏ నాగమణి, గాదె సుశీల, కె పాములమ్మ, కాశీ హంస, ఎం సుధారాణి, కే విజయ రాణి సమ్మె నిర్వహించారు.