సెల్‌ ఫోన్‌ షాపులో భారీ చోరీ

ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలు పట్టణంలోని కర్నూల్‌ రోడ్‌ ఫ్లైఓవర్‌ పక్కనే ఉన్న సెల్‌ ఫోన్‌ షాపులో భారీ దొంగతనం జరిగింది. ఒంగోలు పట్టణంలోని కర్నూల్‌ రోడ్‌ ఫ్లైఓవర్‌ పక్కన ఉన్న శాంసంగ్‌ అక్షిత మొబైల్‌ షాప్‌ లో గుర్తుతెలియని దుండగులు షట్టర్‌ పగలగొట్టి షాపులో 5 లక్షల రూపాయలు నగదు, సుమారు రూ.30 లక్షలు విలువైన స్మార్ట్‌ ఫోన్లన్నీ దోచుకొని వెళ్లినట్లు సెల్‌ షాపు ఓనర్‌ అనంతశెట్టి శ్రీను తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు సిఐ భక్తవత్సలం రెడ్డి క్లూస్‌ టీం తో తనిఖీలు చేస్తున్నారు. గురువారం రాత్రి 11 గంటల వరకు షాప్‌ యజమాని వ్యాపార లావాదేవీలన్నీ చూసుకొని సెల్‌ షాపులు మూసివేసి వెళ్లారు ఉదయం 6 గంటల సమయంలో పేపర్‌ బారు పేపర్‌ వేయటానికి వచ్చి చూడగా షట్టర్‌ పగలగొట్టి ఉండటం చూసి దుకాణం యజమానికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న యజమాని దుకాణంలోని ఐదు లక్షల రూపాయల నగదు, 30 లక్షల విలువైన స్మార్ట్‌ ఫోన్లన్నీ చోరీకి గురయ్యాయని గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే కర్నూల్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ పక్కనే భారీ చోరీ జరగటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

➡️