ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని అన్ని గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీవో దస్తగిరి పంచాయతీ కార్యదర్శులకు సర్పంచ్ లకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన సర్వసర సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ … వేసవిని దఅష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. 30 తేదీ బ్యాంకు కి వెళ్లి పెన్షన్ డబ్బులు డ్రా చేసి ఒకటవ తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం ఎంపీపీ రాఘవరెడ్డి మాట్లాడుతూ వేసవిని దఅష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనుల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వేణుగోపాల స్వామి మండల ఇంజనీరింగ్ ఎలమనాయుడు ఆర్డబ్ల్యూఎస్ జై ఈ రామలింగారెడ్డి ఎంఈఓ శ్రీదేవి, ఈవో ఆర్ డి ఆనంద ప్రసాద్ ఎంపీటీసీలు , సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితర అధికారులు పాల్గొన్నారు.