ఇంటింటి ప్రచారంలో ముత్తుముల తనయుడు

ప్రజాశక్తి-కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లె, హసనాపురం గ్రామాలలో కొమరోలు మండల తెలుగుదేశం అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గిద్దలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్‌రెడ్డి గురువారం ఉదయం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. టీడీపీ కూటమి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్‌రెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల టిడిపి అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, పందనబోయిన రాజా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️