జూన్ 1 నాటికి కౌంటింగ్ ఏజెంట్ల పేర్లు ఇవ్వాలి

May 21,2024 16:58 #counting, #EVM, #Kurnool
  • కౌంటింగ్ హాల్ లోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు
  • జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన

ప్రజాశక్తి కర్నూలు కలెక్టరేట్ : రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. జూన్ 1 నాటికి కౌంటింగ్ ఏజెంట్ల పేర్లు ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్, సమావేశం నిర్వహించారు.కలెక్టర్ మాట్లాడుతూ పోటీలో ఉండే అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లను ఫార్మ్ -18 ద్వారా నియమించుకోవాల్సి ఉంటుందని, ఏ టేబుల్ కి ఐతే కౌంటింగ్ ఏజెంట్ ను నియమించి ఉంటారో, ఆ టేబుల్ వద్దనే కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలన్నారు. ఒక ఏజెంట్ ను కేవలం ఒక టేబుల్ కి మాత్రమే కేటాయించుకోవలసి ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ టేబుల్ లకు కేటాయించడానికి లేదని రాజకీయ పార్టీల ప్రతినిధులకి కలెక్టర్ తెలిపారు.. .. కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ రోజున కచ్చితంగా వారిని నియమించిన లెటర్, ఐడి కార్డ్, డిక్లరేషన్ లెటర్ లు తీసుకొని రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. మొబైల్ ఫోన్లు లోపలికి ప్రవేశం ఉండదని, యూనివర్సిటీ లో పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ డిపాజిట్ సెంటర్ లో మొబైల్ ఫోన్లను పెట్టాల్సి ఉంటుందన్నారు..రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్, లైఫ్ సైన్స్ బ్లాక్, లైబ్రరీ బ్లాక్ లలో కౌంటింగ్ నిర్వహణకు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 16 కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు, ఆదోని అసెంబ్లీ, పార్లమెంట్ కి సంబంధించిన ఈవిఎం యంత్రాలను లైఫ్ సైన్స్ బ్లాక్ లో, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ, పార్లమెంట్ కి సంబంధించిన ఈవిఎం యంత్రాలను ఇంజనీరింగ్ బ్లాక్ లో, మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ, పార్లమెంట్ కి సంబంధించిన ఈవిఎం యంత్రాలను లైబ్రరీ బ్లాక్ లో భద్రపరచడం జరిగిందన్నారు.. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఫ్లోర్ ను ఒక నియోజకవర్గానికి కేటాయించడం జరిగిందని, సంబంధిత ఫ్లోర్ లోనే ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ కౌంటింగ్, అసెంబ్లీ సెగ్మెంట్ లోని పార్లమెంటు కౌంటింగ్ జరుగుతుందని, అందుకు గాను 2 కౌంటింగ్ హాల్ లను, 2 స్ట్రాంగ్ రూమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను గట్టి బందోబస్తు నడుమ పకడ్బందీగా రాయలసీమ యూనివర్సిటీలో మూడంచెల భద్రతతో భద్రపరచడంతో పాటు నిత్యం సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని, అవసరమైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వెళ్లి చూసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లు ఆయా నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ సబ్ ట్రెజరీ కార్యాలయాలలోని స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచడం జరిగిందన్నారు.కౌంటింగ్ కి ఒకటి లేదా కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభం అవుతుందని, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకే కౌంటింగ్ హాల్ లో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ సంబంధిత నియోజకవర్గాల అసెంబ్లీ కౌంటింగ్ హాల్ లోనే జరుగుతుందని, పాణ్యం, కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు 4 వేలు, 5 వేలు పోస్టల్ బ్యాలెట్ లు ఉన్నందున ప్రత్యేక గదులను ఏర్పాటు చేసేందుకు అనుమతుల కొరకు ఎన్నికల కమిషన్ కి పంపడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు పార్లమెంట్ కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ లైఫ్ సైన్స్ బ్లాక్ ప్రత్యేక రూమ్ లో 14 టేబుల్స్ వేసి కౌంటింగ్ చేయడం జరుగుతుందన్నారు.

➡️