ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : వాసవి జాగఅతి ఇంటర్నేషనల్ ఫౌండర్, మెంబర్ హై 5 యూత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు కొల్లిపర అనసూయ సోమవారం రాత్రి ఢిల్లీ రాజ్ భవన్ లో నంది అవార్డు అందుకున్నట్లు హై 5 ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం అనసూయ మాట్లాడుతూ … తన భర్త కొల్లిపర పార్ధసారథి నాగేశ్వరరావు ప్రోత్సాహంతో గత 25 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో నంది అవార్డు అందుకోవడం తనకు మరింత బాధ్యతలు పెంచాయని అన్నారు. ఈ సందర్భంగా హై 5 యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ గోట్రు నాగబాబు మాట్లాడుతూ … జాతీయ స్థాయి లో ప్రభుత్వంతో గుర్తింపు పొందిన హై 5 యూత్ ఫౌండేషన్ గత 17 సంవత్సరల నుంచి అనేక సేవాకార్యక్రమాలు చేస్తు విద్య వైద్యం శుభ్రత ల గురించి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ప్రతి రోజూ ఒకరికైనా భోజనం పెట్టాలి అనే నినాదంతో తలపెట్టి ప్రతి రోజూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ నుంచి ఇంటర్నేషనల్ సంస్థ అయిన శిఖరం ఆర్ట్స్ ధియేటర్ వారు ఢిల్లీ ఏపీ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి తమ సంస్థ అధ్యక్షురాలు కొలిపర అనసూయ నంది అవార్డును అందుకోవడం సంస్థ వ్యవస్థాపకుడిగా తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డులు సంస్థకు మర్యాదలు తీసుకొస్తూనే మరింత బాధ్యతలు పెంచాయి అన్నారు.