చాగలమరి (నంద్యాల) : నంద్యాల జిల్లా చాగలమరి పట్టణంలోని జడ్పీహెచ్ స్కూల్ పోలింగ్ బూత్ వద్ద సోమవారం ఉదయం 6.30 గంటలకే ఓటేసేందుకు మహిళలు బారులుతీరారు. హాస్యం స్కూల్ వద్ద 217 పోలింగ్ కేంద్రంలో ఈవిఎంలు మొరాయించాయి. సరి చేయడానికి సుమారు రెండు గంటలు పట్టవచ్చని సమాచారం అందడంతో ఓటర్లు వెనుదిరిగారు.