ప్రజాశక్తి-మైలవరం (ఎన్టీఆర్ జిల్లా) : దేశ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బంద్ శుక్రవారం మైలవరంలో ప్రశాంతంగా జరిగింది. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సి హెచ్ సుప్రజ, సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ సుధాకర్, సిపిఎం మండల కార్యదర్శి రావు రమేష్ బాబు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రావుల సుబ్బారావు, వజ్రాల వెంకటరెడ్డి, కౌ లు రైతుసంఘం మండల కార్యదర్శి సందీ పాము ఇసాక్, ఆశ వర్కర్స్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు ముఠావర్కర్ నాయకులు పాల్గొన్నారు.