ప్రజాశక్తి- వన్టౌన్ : ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధంసింగ్నగర్లో జరిగే సబ్ జూనియర్ జాతీయ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలకు ఎన్టిఆర్ జిల్లాకు చెందిన ఎస్.రోహిత్కుమార్ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఎన్టిఆర్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఇన్చార్జి దాసరి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రోహిత్ కుమార్ 71 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. రోహిత్ కుమార్ ఎస్కెపివివి హిందూ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/7.jpg)