శానిటేషన్‌ సమస్యలను పరిష్కరించాలి

Jul 1,2024 22:53
  • సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ బోయి సత్యబాబు

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : 50వ డివిజన్‌లో నెలకొన్న శానిటేషన్‌ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌ బోయి సత్యబాబు విఎంసి అధికారులను కోరారు. ఈ సమస్యలపై బి.సత్యబాబు ఫిర్యాదు మేరకు అప్పలస్వామి స్ట్రీట్‌లో డ్రైనేజీ సమస్యను సర్కిల్‌-వన్‌ జోనల్‌ కమిషనర్‌ కీర్తన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ బోయి సత్యబాబు మాట్లాడుతూ ఔట్‌పాల్‌ డ్రైనేజీ లెవెల్‌ నిర్మాణం జరగకపోవడం వలన రెగ్యులర్‌గా శానిటేషన్‌ నిర్వహణ లేనందువలన అపరిశుభ్రతకుత నిలయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు దోమలు వద్ధి ఆందోళనకారంగా మారుతుందని తెలియపరిచారు. వెంటనే డ్రైనేజీ లెవెల్‌ నీరు పారుదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఏ.ఎమ్‌.హెచ్‌. సురేష్‌ శానిటరీ దుర్గారావు పాల్గొన్నారు.

➡️