ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం : డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ స్కాలర్షియ నియంత్రణ పోరాట సమితి సమావేశం కొనసాగుతుంది. ఈ పోరాటానికి మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ పాత గేట్ ఎదురుగా మానవహారం కార్యక్రమం నిర్వహించారు. కాలుష్యాన్ని నివారించాలంటూ భవిష్యత్ తరాలను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పాత గేటు దగ్గర నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.