సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో న్యాయం : బేబినాయన

May 6,2024 21:21

ప్రజాశక్తి-బొబ్బిలి/తెర్లాం : సూపర్‌ సిక్స్‌ మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బేబినాయన అన్నారు. మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కోసమే టీడీపీ, జనసేన, బిజెపి కూటమి సూపర్‌ సిక్స్‌ మ్యానిఫెస్టోను ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన చేసి అభివృద్ధి చేయలేదన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపి అభ్యర్ది కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెర్లాం మండలం గంగన్నపాడులో నిర్వహించిన ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడుతో పాటు అభ్యర్థి బేబినాయన పాల్గొన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గెలిపిస్తే మరింత అభివద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం కునాయవలస, ఎంఆర్‌ అగ్రహారం, పెరుమాలిలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట నాయుడు, మాజీ జెడ్‌పిటిసి వెంకటేశ్వ రరావు, నాయకులు యుగంధర్‌, సురేష్‌, అప్పల నరసింహ రాజు పాల్గొన్నారు. రామభద్రపురం : మండలంలోని కోటశిర్లాం, పాడివాని వలస, కొత్తరేగ, మామిడివలస గ్రామాల్లో టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన విస్తృతంగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో కొత్తరేగ సర్పంచ్‌ కిలపర్తి మురళీ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, టిడిపి నాయకులు కర్రోతు తిరుపతిరావు, మడక తిరుపతినాయుడు, కనిమెరక శంకరరావు, తాడ్డి శ్రీనివాసరావు, వసంతుల తిరుపతిరావు, పాల్గొన్నారు.

➡️