ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 9 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మర్ క్యాంపు 3వ రోజు బుధవారం స్థానిక సుందరయ్య భవన్లో నిర్వహించారు. ప్రతి సంవత్సరం పిల్లలకు సమ్మర్ క్యాంపును క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో క్యారమ్స్ ఆటలు ఆడించారు. 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్యాంపును ఐద్వా మండల కార్యదర్శి నెరుసుల మాలతి పర్యవేక్షించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/sn-padu-summer-camp-ph.jpg)