టిడిపితోనే వెలుగొండ సాధ్యం

Apr 20,2024 00:04 ##tdp #markapuram

ప్రజాశక్తి – మార్కాపురం
వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలో కాబోతుందని, టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు అయ్యేవరకు కష్టపడి పని చేయాలని టిడిపి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. పట్టణంలో శుక్రవారం రాత్రి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గవర్నర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపై నడవాలని అన్నారు. పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ, మార్కాపురం జిల్లా టిడిపితోనే సాధ్యమని అన్నారు. సమావేశంలో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

➡️