రాష్ట్రం కోసం టీడీపీ రావాలి

Mar 15,2024 23:22

ప్రజాశక్తి – పొన్నలూరు
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కొండపి ఎంఎల్‌ఎ డాక్టర్‌ డోల శ్రీ బాల వీరంజనేయ స్వామి అన్నారు. మండలంలోని జడ్ మేకపాడులో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన దామచర్ల సత్యతో కలిసి మాట్లాడారు. మండలంలో టిడిపి హయాంలోనే అభివృద్ది జరిగిందని అన్నారు. జడ్ మేకపాడుతో పాటు 32గ్రామాల రోడ్లకు నిధులు విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఉందన్నారు. దామచర్ల సత్య మాట్లాడుతూ గత 30ఏళ్లుగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం దామచర్ల కుటుంబానికి కల్పించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి, పెద్దాయన ఆంజనేయులు చూపిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ చేశారని అన్నారు. మేకపాడులో తెలుగు యువత నాయకులు కాటూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ కాటూరి వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఉప సర్పంచ్ పాపినేని ప్రసాద్, కాటూరి సుబ్బారావు, కాటూరి లక్ష్మీ నారాయణ, కాటూరి వెంకటేశ్వర్లు, కాటూరి గురవయ్య, కాటూరి ప్రసాద్, కాటూరి మాల్యాద్రితో పాటు 15కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు భేరి పుల్లారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్, కర్ణా కోటిరెడ్డి, పిల్లి వెంకట నారాయణరెడ్డి, సన్నమూరి నరసింహారావు, కాటూరి మాధవరావు, ఉన్నం బసవయ్య పాల్గొన్నారు.

➡️